Ballari: 5న కమ్మ భవన్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2023-09-03T11:11:49+05:30 IST

బళ్లారి నగరంలోని కమ్మ భవనంలో ఈ నెల 5న ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు(Former AP CM Nara Chandrababu Naidu)

Ballari: 5న కమ్మ భవన్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

- ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా..

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): బళ్లారి నగరంలోని కమ్మ భవనంలో ఈ నెల 5న ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు(Former AP CM Nara Chandrababu Naidu) చేతుల మీదుగా దివంగతనేత నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు కమ్మ మహాజన సంఘం తెలిపింది. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన సంఘం సభ్యులు ఈ నెల 5న నారా చంద్రబాబు నాయుడు బళ్లారి మీదుగా అనంతపురం జిల్లాలోని రాయదుర్గానికి వెళ్తారన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు కమ్మ భవన్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, టీడీపీ శ్రేణులు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-09-03T11:11:51+05:30 IST