Union Minister Dharmendra Pradhan: కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జీగా కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్

ABN , First Publish Date - 2023-02-04T13:48:43+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బీజేపీ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది....

Union Minister Dharmendra Pradhan: కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జీగా కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్
Dharmendra Pradhan poll incharge for Karnataka

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బీజేపీ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.(BJP)కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జీగా(poll incharge for Karnataka) కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ ను(Union Minister Dharmendra Pradhan) కేంద్ర పార్టీ నియమించింది. తమిళనాడు బీజేపీ యూనిట్ అధ్యక్షుడు కె అన్నామలైను కర్ణాటక కో ఇన్‌చార్జీగా నియమించింది. ధర్మేంద్ర ప్రధాన్ గతంలో పలు ఎన్నికల ఇన్ చార్జీగా పనిచేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జీగా ప్రధాన్ బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు. గతంలో కేంద్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ధర్మేంద్ర ప్రధాన్ బీహార్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటక ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించారు.

Updated Date - 2023-02-04T13:48:49+05:30 IST