Share News

Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు కేసులో అనుమానితుల గుర్తింపు

ABN , Publish Date - Dec 27 , 2023 | 09:18 AM

న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడు కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరు అనుమానితులను గుర్తించారు. అనుమానితుల కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు కేసులో అనుమానితుల గుర్తింపు

ఢిల్లీ: న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడు కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరు అనుమానితులను గుర్తించారు. అనుమానితుల కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం సంభవించిన ఈ పేలుడులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు లేదు. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఇజ్రాయెల్ ఎంబసీ రాయబారిని ఉద్దేశించి టైప్ చేసిన లేఖ ఇజ్రాయెల్ జెండాతో చుట్టబడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను విమర్శిస్తూ ఆ లేఖ ఉంది. ఆంగ్లంలో రాసిన ఆ లేఖలో ఇది ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. కాగా ‘‘సర్ అల్లా రెసిస్టెన్స్’’ అనే సమూహం ఈ పేలుడుకు తామే బాధ్యులమని ప్రకటించింది.


పేలుడు సంభవించిన తర్వాత ఘటన ప్రాంతాన్ని పోలీసులు కొద్దిసేపు చుట్టుముట్టారు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ యధాస్థితికి చేరుకుంది. ఈ పేలుడు ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. పేలుడు సంభవించిన వెంటనే బాంబు స్క్వాడ్‌లు, ప్రత్యేక పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సోదాలు నిర్వహించాయి. అయితే ఘటనా స్థలంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం కూడా ఈ సంఘటనను ధృవీకరించింది. దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. "సాయంత్రం 5:08 గంటల ప్రాంతంలో రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించిందని మేము నిర్ధారించాం. ఢిల్లీ పోలీసులు, భద్రతా బృందం పరిస్థితిని పరిశీలిస్తున్నాయి" అని ఎంబసీ అధికార ప్రతినిధి గై నిర్ మంగళవారం సాయంత్రం తెలిపారు. కాగా ఈ ఘటనలో ఎంబసీ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 09:18 AM