Chief Minister: నా కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకండయ్యా..

ABN , First Publish Date - 2023-05-23T11:52:00+05:30 IST

తాను వెళ్లే మార్గంలో వాహనాలు నిలిపివేయడం, ప్రజలను అడ్డుకోవడం... తదితరాలు చేపట్టరాదని

Chief Minister: నా కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకండయ్యా..

పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): తాను వెళ్లే మార్గంలో వాహనాలు నిలిపివేయడం, ప్రజలను అడ్డుకోవడం... తదితరాలు చేపట్టరాదని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి(Chief Minister of Puducherry Rangaswamy) ట్రాఫిక్‌ విభాగాన్ని ఆదేశించారు. ఇంటినుంచి శాసనసభకు సీఎం వెళ్లే సమయంలో ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేసి కాన్వాయ్‌ పంపిస్తుంటారు. ప్రస్తుతం ఎండలు మండుతుండడంతో సీఎం వచ్చే సమయంలో అటు వాహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విష యం గమనించిన సీఎం సోమవారం ట్రాఫిక్‌ విభాగం ఎస్పీను పిలిపించి, తాను వెళ్లే సమయంలో వాహనాలు ఆపరాదని, ఒకవేళ్ల రెడ్‌ సిగ్నల్‌ పడితే తన వాహనం కూడా ఆగుతుందని చెప్పి పంపించారు.

Updated Date - 2023-05-23T11:52:00+05:30 IST