Free bus travel: ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళలకు బస్సుల్లో..

ABN , First Publish Date - 2023-03-19T11:14:53+05:30 IST

పుదుచ్చేరి ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ముఖ్యమంత్రి రంగస్వామి(Chief Minister Rangaswamy) ప్రకటిం

Free bus travel: ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళలకు బస్సుల్లో..

ఐసిఎఫ్‌(చెన్నై): పుదుచ్చేరి ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ముఖ్యమంత్రి రంగస్వామి(Chief Minister Rangaswamy) ప్రకటించారు. పుదుచ్చేరి శాసనసభలో ఈనెల 13వ తేది బడ్జెట్‌ దాఖలుచేసిన ముఖ్యమంత్రి, ప్రభుత్వ టౌన్‌ బస్సుల్లో ఆదిద్రావిడ మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని స్వాగతించిన ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు వారితో పాటు అందరికి వర్తించేలా మార్పులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు బదులిచ్చిన సీఎం, మహిళలందరూ ఉచితంగా ప్రభుత్వ టౌన్‌ బస్సుల్లో ప్రయాణం చెయ్యొచ్చని ప్రకటించారు.

Updated Date - 2023-03-19T11:14:53+05:30 IST