Delhi Excise Policy Case : కొన్ని నెలలు జైల్లో పెట్టినా పట్టించుకోను : మనీశ్ సిసోడియా

ABN , First Publish Date - 2023-02-26T11:12:13+05:30 IST

ఢిల్లీ మద్యం విధానం కేసులో కొద్ది నెలలపాటు జైలు జీవితం గడపవలసి వస్తే, దానిని తాను ఏ మాత్రం పట్టించుకోనని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి,

Delhi Excise Policy Case : కొన్ని నెలలు జైల్లో పెట్టినా పట్టించుకోను : మనీశ్ సిసోడియా
Manish Sisodia

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కేసులో కొద్ది నెలలపాటు జైలు జీవితం గడపవలసి వస్తే, దానిని తాను ఏ మాత్రం పట్టించుకోనని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) అన్నారు. తాను స్వాతంత్ర్య సమర యోధుడు భగత్‌ సింగ్‌ అనుచరుడినని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణకు హాజరుకాబోతున్నానని తెలిపారు.

సిసోడియా ఇచ్చిన ట్వీట్‌లో, ఆదివారం ఉదయం తాను సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతానని తెలిపారు. ఈ దర్యాప్తులో తాను సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు. లక్షలాది మంది బాలల ప్రేమాభిమానాలు, కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదాలు తనకు ఉన్నాయన్నారు. కొద్ది నెలలపాటు జైలులో ఉండవలసి వస్తే తాను పట్టించుకోనన్నారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయానికి సిసోడియా వెళ్ళవలసి ఉంది. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. తాను భగత్ సింగ్ అనుచరుడినని తెలిపారు. భగత్ సింగ్ దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారన్నారు. తప్పుడు ఆరోపణలపై జైలుకు వెళ్ళడం తనకు చాలా చిన్న విషయమని చెప్పారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్ శుక్రవారం చాలా ఆసక్తికర సంకేతాలు పంపించిన సంగతి తెలిసిందే. సిసోడియాను ఆదివారం సీబీఐ అరెస్టు చేస్తుందని తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని తెలిపారు.

ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు, అక్రమాలపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత ఏడాది ఆదేశించారు. అనంతరం ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుని, పాత విధానాన్నే అమల్లోకి తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి :

Maharashtra : మహారాష్ట్రలో రెండు శాసన సభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Hyderabad: అమ్మాయి గురించి స్నేహితుడిని పొట్టనపెట్టుకున్న హరిహరకృష్ణ కేసులో ఊహించని ట్విస్ట్..

Updated Date - 2023-02-26T11:12:17+05:30 IST