Home » Kejriwal
Pemmasani Chandrashekhar: సీఎం చంద్రబాబు, తాను ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు తాము ప్రచారం చేసినప్పుడే కనిపించిందని అన్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇందుకు భిన్నంగా పారదర్శకతతో పాలించలో విఫలమైందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. 2015లో ప్రశాంత్ భూషణ్ను పార్టీ నుంచి 'ఆప్' బహిష్కరించింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంతో ఉన్న స్నేహమే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ను ముం చాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
Delhi Election 2025 Results Live Updates in Telugu News: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు క్షణ క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. రౌండ్ రౌండ్కు లెక్కలు మారుతున్నాయి. తొలుత వెనుకంజలో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు కాస్త లీడ్లోకి వచ్చారు. ప్రస్తుతానికి బీజేపీ లీడ్లో ఉండగా.. చివరి వరకు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది..
అందరూ ఊహించినట్టుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకే అనుకూలంగా వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఘెర ఓటమిని మూటగట్టుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై స్పందించారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో 47 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచి కమలం పార్టీ గెలుపు ఖాయం చేసుకుంది. దశాబ్దకాలం తర్వాత ఢిల్లీ పీఠం చేజార్చుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి, సుపరిపాలనకే ఢిల్లీ ఓటర్లు పట్టం కట్టారని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
సొంత నియోజకవర్గమైన న్యూఢిల్లీలో నాలుగోసారి పోటీచేసిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ను విమర్శిస్తూ రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్ చేసిన ద్రౌపదీ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఫిక్స్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మూడోసారి కూడా అడ్రస్ లేకుండా పోగా.. ఆప్ పార్టీ నాలుగోసారి ఢిల్లీ గద్దెనెక్కాలనే ఆశ ఆవిరైంది. ఈ నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆప్, కాంగ్రెస్ పార్టీల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కలసికట్టుగా ఉండనందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ మెజార్టీతో గెలుపు దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ. ఇప్పటికే కమలం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏకంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ను ఓడించిన వ్యక్తి ఎవరా అని ఇప్పుడంతా ఆరా తీస్తున్నారు. కాబోయే ఢిల్లీ సీఎం పర్వేష్ వర్మ అనడంతో ఈయన పేరు ప్రస్తుతం దేశమంతటా హాట్ టాపిక్గా మారింది.
Delhi Election Results 2025: ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. అధిక్యం రౌండ్ రౌండ్కు మారుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదలుకొని ఈవీఎం బ్యాలెట్ల వరకు ఆప్, బీజేపీ మధ్యనే ప్రధానపోటీ కనిపించింది. కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది.