Madhya Pradesh : లారీ బ్రేక్స్ ఫెయిల్... రెండు వాహనాలను ఢీకొట్టడంతో అగ్ని ప్రమాదం... ఇద్దరి మృతి...

ABN , First Publish Date - 2023-03-11T20:30:19+05:30 IST

మధ్య ప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గణపతి ఘాట్ వద్ద ఇండోర్-ముంబై జాతీయ రహదారి

Madhya Pradesh : లారీ బ్రేక్స్ ఫెయిల్... రెండు వాహనాలను ఢీకొట్టడంతో అగ్ని ప్రమాదం... ఇద్దరి మృతి...
Madhya Pradesh

న్యూఢిల్లీ : మధ్య ప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గణపతి ఘాట్ వద్ద ఇండోర్-ముంబై జాతీయ రహదారి (Indore-Mumbai national highway)పై ఓ లారీ డివైడర్‌ను దాటుకొని, రెండు వాహనాలను ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ లారీ ఇండోర్ నుంచి ముంబైకి నాప రాళ్ళను తీసుకెళ్తోంది. బ్రేకులు విఫలమవడంతో డివైడర్‌ను దాటుకొని రోడ్డుకు రెండోవైపునకు వెళ్లడంతో, ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రెండు వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఈ మూడు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. సమీప ప్రాంతాల్లోని అగ్నిమాపక శకటాలను తీసుకొచ్చి, మంటలను ఆర్పుతున్నారు. లారీలో ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవ దహనమయ్యారు. గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని ధమ్నోడ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి రాజ్ కుమార్ యాదవ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Worms Raining : చైనాలో మరో వైపరీత్యం... జనం ఎలా తప్పించుకుంటున్నారంటే...

Supreme Court : సేమ్ సెక్స్ మ్యారేజ్‌ చెల్లుబాటు... సుప్రీంకోర్టు విచారణ సోమవారం...

Updated Date - 2023-03-11T20:30:19+05:30 IST