Minister: టెండర్లకే ఇంత సమయం పడితే.. నిర్మాణానికి మరెంత కాలమో..

ABN , First Publish Date - 2023-09-30T10:46:59+05:30 IST

మదురై ఎయిమ్స్‌(AIIMS Madurai) ఆసుపత్రి టెండర్లకే ఇంత జాప్యం జరిగితే, నిర్మాణపనులు ముగిసేందుకు మరెంత కాలం పడుతుందో

Minister: టెండర్లకే ఇంత సమయం పడితే.. నిర్మాణానికి మరెంత కాలమో..

పెరంబూర్‌(చెన్నై): మదురై ఎయిమ్స్‌(AIIMS Madurai) ఆసుపత్రి టెండర్లకే ఇంత జాప్యం జరిగితే, నిర్మాణపనులు ముగిసేందుకు మరెంత కాలం పడుతుందో అంటూ మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) అన్నారు. ఈ మేరకు శుక్రవారం తన ట్విట్టర్‌లో, మదురై ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణాలకు సంబంధించి సంస్థను ఎంపిక చేసే టెండర్లు మూడోసారి కేంద్ర ప్రభుత్వం పొడిగించిందన్నారు. ఎయిమ్స్‌ నిర్మాణానికి ఒక ఇటుక ఇచ్చి తర్వాత నాలుగేళ్లు పనులు సాగలేదని, ప్రస్తుతం టెండర్ల విధానం ఎంతవరకు సాగి, నిర్మాణాలు పూర్తయ్యేందుకు మరెంతకాలం పడుతుందని విమర్శించారు. రాష్ట్రంపై చిన్నచూపు చూస్తున్న ఈ ప్రభుత్వానికి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మంత్రి ఉదయనిధి ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-09-30T10:46:59+05:30 IST