Minister Udayanidhi: రూ.15 లక్షలన్నారు..15 పైసలు కూడా ఇవ్వలేదు!

ABN , First Publish Date - 2023-08-29T08:33:02+05:30 IST

అధికారంలోకి వస్తే నల్లధనం వెలికితీసి ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని ప్రకటించిన నరేంద్ర మోదీ... ఇప్పటివరకు

Minister Udayanidhi: రూ.15 లక్షలన్నారు..15 పైసలు కూడా ఇవ్వలేదు!

- కార్పొరేట్‌ సంస్థలకు రూ.15 లక్షల కోట్ల రుణ మాఫీ

- మోదీ ప్రభుత్వంపై మంత్రి ఉదయనిధి ఫైర్‌

పెరంబూర్‌(చెన్నై): అధికారంలోకి వస్తే నల్లధనం వెలికితీసి ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని ప్రకటించిన నరేంద్ర మోదీ... ఇప్పటివరకు 15 పైసలు కూడా వేయలేదని క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) విమర్శించారు. సేలంలో ఆదివారం రాత్రి పార్టీ యువజన విభాగం నిర్వాహకుల సమావేశం జరిగింది. మంత్రి కేఎన్‌ నెహ్రూ(Minister KN Nehru) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉదయనిధి మాట్లాడుతూ... ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందన్నారు. అదే సమయంలో కార్పొరేట్‌ సంస్థలకు రూ.15 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఆరోపించారు. ఇక యువజన విభాగం రెండో మహానాడు డిసెంబరు 17న సేలంలో నిర్వహిస్తామన్నారు. మహానాడు నిర్వహణ, ఏర్పాట్లను మంత్రి నెహ్రూ(Minister Nehru)కు అప్పగించామన్నారు. రాహుల్‌ గాంధీ మళ్లీ పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడం ‘ఇండియా’ తొలి విజయమని, ఈ పరంపర పార్లమెంటు ఎన్నికల్లో కొనసాగుతుందని మంత్రి ఉదయనిధి ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-29T08:33:03+05:30 IST