MP Kanimozhi: ఎంపీ కనిమొళి సారథ్యంలో రేపు ఆందోళన

ABN , First Publish Date - 2023-07-22T08:17:03+05:30 IST

మణిపూర్‌లో కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనలను ఖండిస్తూ డీఎంకే మహిళా విభాగం

MP Kanimozhi: ఎంపీ కనిమొళి సారథ్యంలో రేపు ఆందోళన

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మణిపూర్‌లో కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనలను ఖండిస్తూ డీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈనెల 23న నగరంలో ధర్నా నిర్వహించనున్నారు. ఈధర్నాకు మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎంపీ కనిమొళి(MP Kanimozhi) నాయకత్వం వహించనున్నారు. ఈ మేరకు డీఎంకే శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన జారీ చేసింది.

Updated Date - 2023-07-22T08:17:03+05:30 IST