Home » DMK
తమిళనాడు అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే నవ్వులు పూయించారు. ఉదయనిధి మంత్రివర్గంలోనూ దురైమురుగన్కు చోటు ఉంటుందంటూ ఎమ్మెల్యే పన్నీర్సెల్వం చేసిన వ్యాఖ్యలతో సభలో అందరూ నవ్వుకోవడం జరిగింది.
తమిళనాడుకు రాష్ట్ర హోదా కోసం ప్రజాస్వామ్య యుద్ధభూమిలో డీఎంకే ప్రభుత్వం దృఢంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న వారు రాష్ట్ర అధికారాలను చేజిక్కించుకుంటున్న సమయంలో, తమిళనాడు తన గొంతు బలంగా వినిపిస్తూనే ఉంటుందన్నారు.
తమిళనాడు సర్కారు గవర్నర్తో విభేదాల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ 1971లో ఏర్పడిన జస్టిస్ రాజమన్నార్ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర స్వయం ప్రతిపత్తి పరిరక్షణపై నివేదిక రూపొందిస్తుందని, మధ్యంతర నివేదిక వచ్చే జనవరిలో సమర్పిస్తారని తెలిపారు
మాజీ మంత్రి డి.జయకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీ నుంచి వైదొలగే ప్రసక్తే లేదంటూ ఆయన అన్నారు. అంతేగాక తాను పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సోషల్ మీడియాలో పనిగట్టుకుని ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అడుగుకూడా పెట్టలేదని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుందగై అన్నారు. ఈ వ్యా్ఖ్యలు ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారాయి. ఓపక్క గత రెండు రోజుల క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం, మరోవైపు అధికార డీఎంకే, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ పలు విమర్శలు చేస్తుండడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.
మహిళలను కించపరచడం డీఎంకే పార్టీ నేతలకు అలవాటేనని అన్నాడీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెల్లూరు రాజు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొన్ముడి మాత్రమే కాదు, డీఎంకే నేతల్లో పలువురు మహిళలకు వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాల మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించడం అలవాటేనన్నారు.
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ పార్టీ పదవి నుంచి తప్పించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు కుదరడంపై డీఎంకే ప్రతినిధి టీకేఎస్ ఇళాంగోవన్ సూటిగా స్పందించారు.
వక్ఫ్ సవరణ చట్టం తమిళనాడులోని 50 లక్షల మంది ముస్లింలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని 20 కోట్ల మంది ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని డీఎంకే ఎంపీ ఎ.రాజా తన పిటిషన్లో పేర్కొన్నారు.
తమిళ భాషలో మెడికల్ కోర్సులు ప్రారంభించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని తాను కోరుతున్నాననీ, ఇందువల్ల పేద కుటుంబాల పిల్లలు సైతం వైద్యులు కావాలనే తమ కలలను పండించుకుంటారని మోదీ అన్నారు.