Puducherry: పుదుచ్చేరికి రాష్ట్ర హోదా.. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

ABN , First Publish Date - 2023-04-01T13:04:31+05:30 IST

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి(Puducherry)కి రాష్ట్ర హోదా కల్పించాలని పేర్కొంటూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.

Puducherry: పుదుచ్చేరికి రాష్ట్ర హోదా.. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి(Puducherry)కి రాష్ట్ర హోదా కల్పించాలని పేర్కొంటూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి(Chief Minister N. Rangaswamy) శుక్రవారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతుగా అన్ని పార్టీల సభ్యులు మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్‌ ప్రకటించారు. ప్రతిపక్ష నేత శివ, డీఎంకే ఎమ్మెల్యేలు నాజిమ్‌, హనిఫాల్‌ కెనడీ, సెంధిల్‌కుమార్‌, బీజేపీ సభ్యులు, ఎన్నార్‌ కాంగ్రెస్‌ సభ్యులు సీఎం రంగస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-04-01T13:04:31+05:30 IST