Schools: 26న పాఠశాలలకు సెలవు

ABN , First Publish Date - 2023-08-23T08:02:25+05:30 IST

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(Puducherry)లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ మంగళవారం

Schools: 26న పాఠశాలలకు సెలవు

పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(Puducherry)లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్‌డీసీ స్టోర్‌ కీపర్‌ గ్రేడ్‌3 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు ఈ నెల 27న జరుగనున్నాయి. పరీక్షలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాల్సి వుండగా, 26వ తేదీన (శనివారం) అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేలా అన్ని పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని విద్యాశాఖ సూచించింది.

Updated Date - 2023-08-23T08:02:25+05:30 IST