Vande Bharat Train: చెన్నై-కోవై వందే భారత్‌ రైలు ఛార్జీ ఎంతో తెలిస్తే మీరు...

ABN , First Publish Date - 2023-04-08T12:16:45+05:30 IST

చెన్నై-కోయంబత్తూర్‌ మధ్య ‘వందే భారత్‌’ రైలును శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. బుధవారం మినహాయించి మిగిలిన ఆరు

Vande Bharat Train: చెన్నై-కోవై వందే భారత్‌ రైలు ఛార్జీ ఎంతో తెలిస్తే మీరు...

పెరంబూర్‌(చెన్నై): చెన్నై-కోయంబత్తూర్‌ మధ్య ‘వందే భారత్‌’ రైలును శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. బుధవారం మినహాయించి మిగిలిన ఆరు రోజులు ఉదయం 6 గంటలకు కోయంబత్తూర్‌లో బయల్దేరే రైలు 11.50 గంటలకు చెన్నై చేరుకుంటుంది. అలాగే, చెన్నై నుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు బయల్దేరి రాత్రి 8.15 గంటలకు కోయంబత్తూర్‌ చేరుకుంటుంది. ఈ రైలు పెరంబూర్‌, అరక్కోణం, గుడియాత్తం, వాణియంబాడి, తిరుపత్తూర్‌, మోరాప్పూర్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌ స్టేషన్లలో ఆగనుంది. ఈ రైలుకు ఏసీ ఛైర్‌కార్‌లో చెన్నై నుంచి కోవైకు రూ.1,215, ఏసీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌లో రూ.2,310 ఛార్జీగా నిర్ణయించారు. ఈ రైళ్ల ముందస్తు రిజర్వేషన్‌ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-04-08T12:16:45+05:30 IST