Share News

Viral Video: పరిమితికి మించి జనాలను ఎక్కించుకుంటే ఇలాగే జరుగుతుంది.. ఈ ఆటో పరిస్థితి చివరకు ఏమైందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-11-01T13:37:28+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. మన దగ్గర సిటీలో తిరగడానికి ఆటోలు ఉన్నట్లే అక్కడ ఈ-రిక్షాలు ఉంటాయి.

Viral Video: పరిమితికి మించి జనాలను ఎక్కించుకుంటే ఇలాగే జరుగుతుంది.. ఈ ఆటో పరిస్థితి చివరకు ఏమైందో మీరే చూడండి..!

Viral Video: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. మన దగ్గర సిటీలో తిరగడానికి ఆటోలు ఉన్నట్లే అక్కడ ఈ-రిక్షాలు ఉంటాయి. అలాంటి ఓ ఈ-రిక్షాకు సంబంధించినదే ఆ వీడియో. సాధారణంగా మన దగ్గర చూస్తుంటాం కదా.. ఆటో వాళ్లు లోపల కూర్చువడానికి స్థలంలేక పోయిన అటుఇటు అర్జెస్ట్ చేసి, దాని పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. అలాంటప్పుడు కొన్నిసార్లు ప్రమాదాలు జరగుతుంటాయి కూడా. ఇక్కడ కూడా అదే జరిగింది.

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో కిచెన్ చిమ్నీని ఆర్డర్ ఇచ్చాడో వ్యక్తి.. పార్శిల్ ఇంటికి వచ్చాకా ఓపెన్ చేస్తే కనిపించిన దృశ్యం చూసి..!


ఈ-రిక్షా సామర్థ్యానికి మించి ప్రయాణికులకు ఎక్కించడంతో వెనుక బరువు ఎక్కువయింది. దాంతో అమాంతం ఆ ఈ-రిక్షా ముందు నుంచి పైకి లేచింది. ఇంకేముంది.. అందులోని ప్రయాణికులందరూ కిందపడిపోయారు. నడిరోడ్డుపై ఈ షాకింగ్ సీన్ జరిగింది. వెంటనే పక్కన వెళ్తున్న వాహనదారులు వచ్చి రిక్షా ముందు భాగాన్ని పట్టుకుని కిందికి దించారు. ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాలో ఈ వీడియోకు ఇప్పటివరకు 10లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'ఇది చూడటానికి ఫన్నీగా ఉన్నా.. చాలా డేంజర్' అని కామెంట్ చేస్తున్నారు.

Viral: మీరెంత తెలివైనవాళ్లో ఈ ఒక్క ఫొటోయే చెప్పేస్తుంది..? ఈ 4 గ్లాసుల్లో దేనిలో ఎక్కువ నీళ్లు ఉన్నాయో చెప్పగలరా..?


Updated Date - 2023-11-01T13:37:28+05:30 IST