Woman: బాత్రూంకు వెళ్తే మూత్రంతో పాటు బయటకొచ్చిన దూది ఉండలు.. భయంతో ఆస్పత్రికి వెళ్తే వెలుగులోకి అసలు నిజం..!

ABN , First Publish Date - 2023-06-15T11:16:45+05:30 IST

కేరళలో వైద్యుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. సీజెరియన్ (Cesarean) కోసం వచ్చిన మహిళ విషయంలో వైద్యులు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించారు.

Woman: బాత్రూంకు వెళ్తే మూత్రంతో పాటు బయటకొచ్చిన దూది ఉండలు.. భయంతో ఆస్పత్రికి వెళ్తే వెలుగులోకి అసలు నిజం..!

ఇంటర్నెట్ డెస్క్: కేరళలో వైద్యుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. సీజెరియన్ (Cesarean) కోసం వచ్చిన మహిళ విషయంలో వైద్యులు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించారు. దాంతో ప్రస్తుతం బాధిత మహిళ పరిస్థితి ఘోరంగా మారింది. ఆస్పత్రి నిర్వాకంపై ఆరోగ్యశాఖ మంత్రితో పాటు జిల్లా పరిపాలన విభాగానికి ఆమె ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని పలక్కడ్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ నెల 9న కాన్పు కోసం ఈదతరాకు చెందిన షబానా అనే మహిళ చేరింది. దాంతో ఆ తర్వాతి రోజు ఆస్పత్రి వైద్యులు ఆమెకు సీజెరియన్ చేశారు. రెండు రోజుల తర్వాత డిశ్చార్జి చేశారు. అయితే, ఇంటికి వచ్చిన తర్వాతి నుంచి ఆమెకు పొత్తికడుపులో నొప్పి మొదలైంది.

ఈ క్రమంలో మంగళవారం బాత్రూంకు వెళ్తే మూత్రంతో పాటు దూది ఉండలు బయటకొచ్చాయి. దాంతో భయపడిన షబానా వెంటనే తనకు సీజెరియన్ నిర్వహించిన ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అసలు విషయం చెప్పారు. సీజెరియన్ సమయంలో పొట్టలోనే దూది మరిచిపోయినట్లు తాపీగా సెలవిచ్చారు. దాంతో వైద్యుల నిర్లక్ష్యంపట్ల షబాబా కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ముందు నిరసనకు దిగారు. అనంతరం ఈ విషయమై బాధితురాలు ఆరోగ్యశాఖ మంత్రితో పాటు జిల్లా పరిపాలన విభాగానికి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై వెంటనే స్పందించిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ఆస్పత్రి యాజమాన్యాన్ని షబానా చికిత్స తాలూకు రికార్డులు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

Viral Video: చిన్నారీ.. నీకు హ్యాట్సాఫ్ తల్లీ.. ఓ కాలు లేకున్నా పరుగు పోటీల బరిలోకి దిగి.. ఓడిపోయానని తెలిసినా కూడా..!


Updated Date - 2023-06-15T11:16:45+05:30 IST