Team India: విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-08-25T15:02:05+05:30 IST

బీసీసీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టీమిండియాకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. ఈ నేపథ్యంలో యోయో టెస్ట్ స్కోరును సోషల్ మీడియాలో కోహ్లీ షేర్ చేయడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. ఆసియా కప్‌కు ముందు బెంగళూరులోని శిక్షణ శిబిరంలో టీమిండియా క్రికెటర్లకు టీమ్ మేనేజ్‌మెంట్ ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించింది. ఈ యోయో టెస్టులో తనకు 17.2 స్కోరు వచ్చిందని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

Team India: విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే..?

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఈనెల 30 నుంచి జరిగే ఆసియా కప్ టోర్నీకి సిద్ధం అవుతున్నాడు. ఈ టోర్నీలో అందరి కళ్లు అతడి ప్రదర్శనపై ఉంటాయన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. దీనికి కారణం సోషల్ మీడియాలో కోహ్లీ షేర్ చేసిన ఓ పోస్ట్ అని స్పష్టమవుతోంది. గురువారం నాడు విరాట్ కోహ్లీ తన యోయో ఫిట్‌నెస్ టెస్ట్ స్కోర్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ విషయం బీసీసీఐ పెద్దలను కలవరపాటుకు గురిచేసింది. విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్‌గా మారిన కొన్ని గంటల తర్వాత టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ కఠినమైన మార్గదర్శకాలను రూపొందించింది.

బీసీసీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టీమిండియాకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. ఈ నేపథ్యంలో యోయో టెస్ట్ స్కోరును సోషల్ మీడియాలో కోహ్లీ షేర్ చేయడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. ఆసియా కప్‌కు ముందు బెంగళూరులోని శిక్షణ శిబిరంలో టీమిండియా క్రికెటర్లకు టీమ్ మేనేజ్‌మెంట్ ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించింది. ఈ యోయో టెస్టులో తనకు 17.2 స్కోరు వచ్చిందని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తనకు ఫిట్‌నెస్ టెస్టులో 17.2 రావడం ఎంతో ఆనందంగా ఉందని అభిమానులతో పంచుకున్నాడు. బీసీసీఐ నిర్దేశించిన స్కోరు 16.5ని కోహ్లీ దాటాడు. దీంతో అతడు సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. పబ్లిక్ ప్లాట్‌ఫారాలలో టీమ్ రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయడం బీసీసీఐ రూల్స్‌ను ఉల్లంఘించడం కింద వస్తుందని కోహ్లీని హెచ్చరించింది. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. భారత ఆటగాళ్లు ఎవరూ టీమ్ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని బీసీసీఐ తెలిపింది.

ఇది కూడా చదవండి: Team India: ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదుర్స్.. శ్రేయాస్ అయ్యర్ భారీ సెంచరీ

కాగా ఈనెల 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ మేరకు టీమిండియా క్రికెటర్లకు ఆరు రోజుల శిక్షణ శిబిరాన్ని బీసీసీఐ నిర్వహిస్తోంది. ఈ క్యాంప్‌లో కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా పాల్గొన్నారు. కోహ్లీతో పాటు వీళ్లిద్దరూ కూడా యోయో టెస్టులో విజయం సాధించారు. వీళ్లంతా వెస్టిండీస్ పర్యటన నుంచి భారత్ వచ్చిన తర్వాత ఐర్లాండ్ పర్యటన నుంచి విశ్రాంతి తీసుకున్నారు. మరోవైపు ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో పాల్గొన్న బుమ్రా, సంజు శాంసన్, ప్రసిద్ధ్ కృష్ణ, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు శుక్రవారం నాడు శిక్షణ క్యాంప్‌కు హాజరు కానున్నారు. వీళ్లు ఐర్లాండ్‌లోని డబ్లిన్ నుంచి నేరుగా బెంగళూరు చేరుకోనున్నారు.

Updated Date - 2023-08-25T17:20:45+05:30 IST