Virat Kohli: కోహ్లీ అర్ధ సెంచరీ.. ఖాతాలో మరో రికార్డ్!

ABN , First Publish Date - 2023-01-10T16:22:37+05:30 IST

శ్రీలంకతో ఇక్కడి బరస్పర క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు దిశగా ముందుకు

Virat Kohli: కోహ్లీ అర్ధ సెంచరీ.. ఖాతాలో మరో రికార్డ్!

గువాహటి: శ్రీలంకతో ఇక్కడి బరస్పర క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ (Team India)భారీ స్కోరు దిశగా ముందుకు సాగుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభమన్ గిల్ (70) అర్ధ సెంచరీలు సాధించగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli)కూడా అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. 48 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో కలిసి అర్ధ సెంచరీ (51) పూర్తి చేసుకున్నాడు. ధనంజయ బౌలింగులో అదిరిపోయే సిక్సర్ కొట్టిన కోహ్లీ వన్డేల్లో 65వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అంతేకాదు, ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 44 పరుగులకు చేరుకోగానే ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. శ్రీలంకపై ఇప్పటి వరకు 2,264 పరుగులు చేశాడు. విండీస్‌పై 2,261, ఆస్ట్రేలియాపై 2,083, దక్షిణాఫ్రికాపై 1,403 పరుగులు చేశాడు. ప్రస్తుతం 40 ఓవర్లు పూర్తయ్యాయి. భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. కోహ్లీ (74), కేఎల్ రాహుల్ (35) క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-01-10T16:30:23+05:30 IST