IND vs WI 2nd T20I: టాస్ గెలిచిన టీమిండియా.. కీలక ఆటగాడికి గాయం.. తుది జట్టులో ఒక మార్పు

ABN , First Publish Date - 2023-08-06T19:47:42+05:30 IST

వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.

IND vs WI 2nd T20I: టాస్ గెలిచిన టీమిండియా.. కీలక ఆటగాడికి గాయం.. తుది జట్టులో ఒక మార్పు

గయానా: వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. నెట్ ప్రాక్టీస్‌లో కుల్దీప్ యాదవ్ చేతికి గాయం అయిందని, అందుకే అతను ఈ మ్యాచ్ ఆడడం లేదని టాస్ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే గాయం పెద్దది ఏం కాదని, కాకపోతే ముందు జాగ్రత్తగా ఈ మ్యాచ్‌లో ఆడించడం లేదని చెప్పాడు. అటు అతిథ్య వెస్టిండీస్ మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఇక మొదటి టీ20 మ్యాచ్‌లో ఓడి సిరీస్‌లో వెనుకబడ్డ భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి లీడ్‌ను సమం చేయాలని భావిస్తోంది. కాగా మొదటి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన వెస్టిండీస్ సిరీస్‌లో 1-0తో అధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.


తుది జట్లు

వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మేయర్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్

భారత్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, రవి బిష్ణోయ్

Updated Date - 2023-08-06T20:04:49+05:30 IST