MLA Durgam Chinnaiah: నేను ఎవరిపై దాడి చేయలేదు

ABN , First Publish Date - 2023-01-04T11:49:18+05:30 IST

జిల్లాలోని మందమర్రి టోల్ ప్లాజా ఘటనపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు.

MLA Durgam Chinnaiah: నేను ఎవరిపై దాడి చేయలేదు

మంచిర్యాల: జిల్లాలోని మందమర్రి టోల్ ప్లాజా ఘటనపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (MLA Durgam Chinnaiah) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘నేను ఎవరిపై దాడి చేయలేదు. రోడ్డు నిర్మాణం పూర్తి కాకున్నా టోల్ వసూల్ చేయడాన్ని ప్రశ్నించాను. టోల్‌గేట్ సిబ్బంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంబులెన్స్‌లను కూడా ఆపేసి సతాయిస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదు. నన్ను టోల్ ప్లాజా ఓపెనింగ్‌కు కూడా పిలవలేదు. రోడ్డును పూర్తి చేశాకే టోల్ వసూలు చేయాలి’’ అని ఎమ్మెల్యే చిన్నయ్య పేర్కొన్నారు.

కాగా... మందమర్రి టోల్‌గేట్ వద్ద తన వాహనాలను అడ్డుకోవడంపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అయితే టోల్‌గేట్ సిబ్బందే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు వెల్లడించారు.

Updated Date - 2023-01-04T11:49:19+05:30 IST