Share News

KC Venugopal: ఆ మంత్రి వల్లే రైతుబంధు ఆగింది

ABN , First Publish Date - 2023-11-27T14:56:33+05:30 IST

Telangana Elections: బీఆర్ఎస్, మంత్రి హరీష్రావు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లే రైతుబంధు ఆగిందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిచిపోవడంతో కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రైతుబంధు రైతుల హక్కన్నారు. హరీష్ రావు భాధ్యతారహిత ప్రకటన ఎందుకు చేయవలసి వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ ఆదేశాలనే హరీష్‌రావు అమలు చేస్తున్నారని ఆరోపించారు.

KC Venugopal: ఆ మంత్రి వల్లే రైతుబంధు ఆగింది

హైదరాబాద్: బీఆర్ఎస్, మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లే రైతుబంధు (Rythu Bandhu) ఆగిందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (AICC General Secretary KC Venugopal) వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిచిపోవడంతో కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రైతుబంధు రైతుల హక్కన్నారు. హరీష్ రావు భాధ్యతారహిత ప్రకటన ఎందుకు చేయవలసి వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ ఆదేశాలనే హరీష్‌రావు అమలు చేస్తున్నారని ఆరోపించారు. వారిద్దరి సంకుచిత భావం వల్ల.. రైతు బంధు నిలిచిందన్నారు. ఈ పాపానికి బీఆర్ఎస్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తూ కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-27T15:52:11+05:30 IST