Share News

Balka Suman: వివేక్‌పై ECIకి ఫిర్యాదు చేశాం

ABN , First Publish Date - 2023-11-15T15:21:11+05:30 IST

చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్‌పై ECI ప్రతినిధి అబ్ జర్వర్ ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ ఎమెల్యే బాల్క సుమన్ ( Balka Suman ) తెలిపారు.

Balka Suman: వివేక్‌పై ECIకి ఫిర్యాదు చేశాం

చెన్నూరు: చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్‌పై ECI ప్రతినిధి అబ్ జర్వర్ ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ ఎమెల్యే బాల్క సుమన్ ( Balka Suman ) తెలిపారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘వివేక్‌పై ED కి ఫిర్యాదు చేస్తాము. వివేక్ తనకు చెందిన విజిలెన్స్ అనే కంపెనీకి 8కోట్ల నగదు బదిలీ అయింది. కోట్ల రూపాయలతో వివేక్ అందరినీ కొంటున్నారు.హైదరాబాద్ నుంచి రామగుండంకు నగదు బదిలీ అయింది. వివేక్‌కు సంబంధించిన అన్ని సంస్థల కంపెనీలపై ECI నిఘా పెట్టాలని కోరాం. తన కుటుంబ సభ్యులకు, పెట్రోల్ బంక్ అండ్ రైస్ మిల్లులకు, మార్కెట్ వాళ్లకు ఆ డబ్బులను వివేక్ పంపుతున్నారు. కరీంనగర్, మంచిర్యాల, మందమర్రి, చెన్నూరులో వ్యాపారులకు వివేక్‌కు పైసలు పంపిణీ చేస్తున్నారు. వివేక్ కొడుకు, బిడ్డ, అల్లుడు, విశాఖ సంస్థల సిబ్బంది చెన్నూరులో వివేక్ కోసం పనిచేస్తున్నారు. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన వివేక్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలి. బీజేపీ మేనిఫస్టో కమిటీ చైర్మన్‌గా వివేక్ మొన్నటి వరకు ఉన్నారు. వివేక్ వల్ల బీజేపీ ఇప్పటికీ మేనిఫెస్టో ప్రకటించలేదు. బాల్క సుమన్ వేల కోట్లు సంపాదిస్తే వివేక్ లెక్క విశాఖ లాంటి సంస్థలు పెట్టే వాన్ని.నాలుగేళ్లు వివేక్ చెన్నూరులో కనిపించలేదు. సొంత తండ్రినే పట్టించుకోని వివేక్ ...చెన్నూరు ప్రజలను పట్టించుకుంటారా? వివేక్ మొదటి నుంచి కార్పొరేట్ రాజకీయాలు చేశారు. సామంతరాజు లెక్క ఉరుకొకరిని పెట్టుకోని, పూడలిజం పాలన వివేక్ చేశారు. ధన రాజకీయాలు చేసే వివేక్ లాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఈ ఎన్నికల్లో వివేక్ కోట్ల రూపాయలు వెదజల్లి నన్ను ఓడగొట్టే కుట్ర చేస్తున్నారు. డబ్బు అహంకారానికి - చెన్నూరు ఆత్మగౌరవానికి, వేల కోట్లు ఉన్న వ్యక్తికి - వేల కోట్లు తెచ్చే వ్యక్తికి మధ్య ఈ పోటీ జరుగుతుంది. చెన్నూరు అభివృద్ధిపై అక్కడ ఏ చౌరస్తా లోనైనా చర్చకు సిద్ధం. నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. నేను వ్యక్తిగతంగా అనాలంటే అనగలను. ఆవుల మందపై తోడేళ్లు పడ్డట్లు వివేక్ తన బలగంతో చెన్నూరుకి వచ్చారు’’ అని బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-15T15:34:00+05:30 IST