Share News

KCR: తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ

ABN , First Publish Date - 2023-11-07T15:30:43+05:30 IST

తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు.

KCR: తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ

మంచిర్యాల: తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ (Congress) అని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మందమర్రిలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ... తెలంగాణ బాగు కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. మాయమాటలు చెబుతున్న కాంగ్రెస్‌ను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు. సింగరేణిని ఖాయిలా పడేసి కేంద్రానికి వాటా ఇచ్చింది కాంగ్రెస్ అని.. అవే బొగ్గు గనులను ప్రైవేటీకరచేస్తోంది బీజేపీ అని విమర్శించారు. మోదీకి (ఊఛ ఛేదు) ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుందని.. అందుకే అన్ని వ్యవస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. ధరణి పోర్టల్‌పై (Dharani Portal) కాంగ్రెస్‌కు కన్ను కుట్టిందన్నారు. ధరణి తీసేస్తామంటున్నరని.. రైతు బంధు ఇవ్వొద్దంటున్నారన్నారు. ఐదేళ్ల భవిష్యత్‌ను డిసైడ్ చేసే ఎన్నికల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-07T15:30:44+05:30 IST