Share News

Pradeep Eshwar: కర్ణాటక గ్యారెంటీలపై ఓపెన్ ఛాలెంజ్‌కు ప్రశాంత్‌ సిద్ధమా?

ABN , First Publish Date - 2023-11-21T13:50:07+05:30 IST

కర్ణాటకలో అనులు చేస్తున్న గ్యారెంటీలపై ఓపెన్ ఛాలెంజ్‌కు బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి సిద్ధమా అని కర్ణాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ సవాల్ విసిరారు.

Pradeep Eshwar: కర్ణాటక గ్యారెంటీలపై ఓపెన్ ఛాలెంజ్‌కు ప్రశాంత్‌ సిద్ధమా?

నిజామాబాద్: కర్ణాటకలో అమలు చేస్తున్న గ్యారెంటీలపై ఓపెన్ ఛాలెంజ్‌కు బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి (BRS candidate is Vemula Prashant Reddy) సిద్ధమా అని కర్ణాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ (Karnataka MLA Pradeep Eshwar) సవాల్ విసిరారు. మంగళవారం మీడియాతో కర్ణాటక ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘రేపు (బుధవారం) వేల్పూర్ చౌరస్తాకు 12 గంటల‌కు వస్తా నీవు రా కర్ణాటక గ్యారెంటీలపై చర్చిద్దాం. బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో అబద్ధలు ప్రచారం చేస్తున్నారు. కర్ణాటకలో ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. ప్రతి ఒక్క గ్యారెంటీ పథకాన్ని అమలు చేస్తున్నాం. 50 వేల కోట్లతో గ్యారెంటీల అమలు కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాము. కారులో వెళదామ కర్ణాటకకి విమానంలో వెళదామ ఖర్చు అంత నాదే మీ భద్రకు నాదే బాధ్యత రండి మీ కార్యకర్తలను తీసుకొని. ఏ ఊరికి వెల్దామో చెప్పు అక్కడ మేము ఇచ్చిన గ్యారెంటీలో అమలు చేస్తున్నామో లేదో నిరూపిస్తా. అక్కడ గ్యారెంటీలు అమలు చేస్తున్నట్లు ఉంటే మీరు వచ్చి ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఓడిపోతున్నాం అని తెలిసి అబద్దాలు చెప్పడం కరెక్ట్ కాదు ప్రశాంత్ రెడ్డి. ఈ ఛాలెంజ్‌కు సిద్ధమా ప్రశాంత్ రెడ్డి రేపు 12 గంటలకు వేల్పూర్ చౌరస్తా కి రా. కాంగ్రెస్ సోనియా గాంధీ (Sonia Gandhi) తెలంగాణ ఇస్తే మీరు అధికారం అనుభవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలపై తెలంగాణ వస్తే. ఆ కుటుంబంలో ఎందరికి ఎమ్మెల్యే టికెట్ పదవులు ఇచ్చారో తెలపాలి’’ ప్రదీప్ ఈశ్వర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-11-21T13:50:08+05:30 IST