Share News

KCR :పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల కక్ష కట్టింది

ABN , First Publish Date - 2023-11-13T18:08:33+05:30 IST

నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ( Peddi Sudarshan Reddy ) పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ( Sharmila ) కక్ష కట్టిందని సీఎం కేసీఆర్ ( CM KCR ) తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం నాడు నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.

KCR :పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల కక్ష కట్టింది

వరంగల్: నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ( Peddi Sudarshan Reddy ) పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ( Sharmila ) కక్ష కట్టిందని సీఎం కేసీఆర్ ( CM KCR ) తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం నాడు నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘సుదర్శన్ రెడ్డిని ఓడించేందుకు షర్మిల డబ్బు కట్టలు పంపుతుందట మీరు తిప్పికొట్టి పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఈ ఎన్నికల్లో గెలిపించాలి. ప్రజలు పార్టీల చరిత్రలు చూసి ఓటెయ్యండి. ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పార్టీ కాంగ్రెస్. ఓటు అంటే ఆశామాషీ కాదు... తలరాతలు మార్చే గీత. పాఖాల ఆయకట్టుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నీరు అందించారు. గతంలో నర్సంపేటలో ఎవరూ చేయని అభివృద్ధిని పెద్ది సుదర్శన్ రెడ్డి చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎవుసం అంటే తెలియదు కానీ ఆయన కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. వరంగల్ వెళ్లాల్సిన మెడికల్ కాలేజీని పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటకు తీసుకొచ్చారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-13T18:29:51+05:30 IST