Yadadri: భక్తజనసంద్రం.. యాదగిరిక్షేత్రం

ABN , First Publish Date - 2023-05-13T20:48:13+05:30 IST

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో శనివారం భక్తుల (devotees) సందడి నెలకొంది.

Yadadri: భక్తజనసంద్రం.. యాదగిరిక్షేత్రం

యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో శనివారం భక్తుల (devotees) సందడి నెలకొంది. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఇష్టదైవాల దర్శనాల కోసం తరలివచ్చారు. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులతో కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, బస్ట్టాండ్‌, కొండపైన ఆలయ తిరువీధులు, ఉభయ దర్శన క్యూలైన్లు, ప్రధానాలయం, ప్రసాదాల విక్రయశాల తదితర ప్రాంతాలు కోలాహలంగా కనిపించాయి. ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు ధర్మదర్శనాలకు రెండు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. సుమారు 25వేల మందికి పైగా యాదగిరిక్షేత్రాన్ని సందర్శించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. కొండ దిగువన అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. పాతగుట్ట ఆలయంలో స్వయంభువులను దర్శించుకున్న భక్తులు ఆలయ ఆవరణలో పిల్లాపాపలతో సేదతీరారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.39,93,873 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-05-13T20:48:13+05:30 IST