Home » Yadadri temple
నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి(వైటీపీఎస్) భారీ సంఖ్యలో విద్యుత్ ఇంజనీర్లు, సిబ్బందిని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (టీ జీజెన్కో) బదిలీ చేసింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. లక్ష్మీనరసింహ స్వామి ధర్మ దర్శనానికి సుమారు 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.
రాష్ట్రంలో ఆధ్మాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆలయంలో 14చోట్ల మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. 47 చోట్ల టాయిలెట్స్ నిర్మించినట్లు చెప్పారు. విష్ణు పుష్కరిణీ గుండాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
యాదగిరిగుట్ట, మార్చి 10: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10గంటలకు ప్రధానాలయ ముఖ మండపంలో అర్చక, వేదపండితుల బృందం సంప్రదాయరీతిలో లక్ష్మీనృసింహుల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మరోవైపు మేడారంకు వచ్చిన భక్తులు కూడా యాదగిరి గుట్టకు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది.
యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ( Yadagirigutta Lakshminarasimha Swami ) ఆలయానికి రికార్డ్ స్థాయిలో నిత్య ఆదాయం పెరిగింది. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
యాదాద్రి: కార్తీకమాసం, ఆదివారం కావడంతో యాదగిరిగుట్టకు భక్తులరద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.
యాదాద్రి: పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా శనివారం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలను మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మూసివేయనున్నారు.