Hyderabad: రాజేంద్రనగర్‌లో దారుణం...

ABN , First Publish Date - 2023-04-11T12:32:23+05:30 IST

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో దారుణం (Atrocious) జరిగింది. అత్తాపూర్ (Attapur) పిల్లర్ నెంబర్ 133 వద్ద మహిళను గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు.

Hyderabad: రాజేంద్రనగర్‌లో దారుణం...

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో దారుణం (Atrocious) జరిగింది. అత్తాపూర్ (Attapur) పిల్లర్ నెంబర్ 133 వద్ద మహిళను గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. మహిళ ఒంటిపై పెట్రోల్ (Petrol) పోసి నిప్పు పెట్టారు. యాభై శాతం కాలిన గాయాలతో మహిళ రోడ్డుపై పడి పోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన ప్రదేశానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన భర్తే తగలబెట్టాడని బాధితురాలు చెబుతోంది. భర్త తగులబెట్టాడా? లేక తానే తగులబెట్టు కుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా బాధితురాలు అత్తాపూర్‌లో సాయిబాబా దేవాలయం (Saibaba Temple) దగ్గర యాచకురాలు శివానీగా పోలీసులు గుర్తించారు. ఆమెకు మానసిక పరిస్థితి సరిగా లేదని, ఒక పాప కూడా ఉందని, భర్తకు దూరంగా ఉంటోందని పోలీసులు కనుగొన్నారు. అయితే శివానినీ తగల బెట్టింది ఎవరన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన భర్తే తనపై పెట్రోల్ పోసి తగల బెట్టాడని బాధితురాలు చెబుతోంది. ప్రస్తుతం ఆమె ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-04-11T12:32:23+05:30 IST