TS News.. వికారాబాద్‌ జిల్లా: యాలాలలో టెన్త్ విద్యార్థినిపై దారుణం..

ABN , First Publish Date - 2023-02-22T13:07:51+05:30 IST

వికారాబాద్‌ జిల్లా: యాలాలలో దారుణం (Atrocious) జరిగింది. పదో తరగతి విద్యార్థిని (Tenth class student) రఘుపతి అనే యువకుడు కిడ్నాప్‌ చేసి.. అత్యాచారం చేశాడు.

TS News.. వికారాబాద్‌ జిల్లా: యాలాలలో టెన్త్ విద్యార్థినిపై దారుణం..

వికారాబాద్‌ జిల్లా: యాలాలలో దారుణం (Atrocious) జరిగింది. పదో తరగతి విద్యార్థినిని (Tenth Class Student) రఘుపతి అనే యువకుడు కిడ్నాప్‌ (Kidnapping) చేసి.. అత్యాచారం (Rape) చేశాడు. ప్రభుత్వ పాఠశాలలో (Government school) చదువుతున్న విద్యార్థిని కారులో ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... విహారయా

త్ర కోసం స్కూల్‌ హెడ్మాస్టార్ వెంకటయ్య విద్యార్థులను హైదరాబాద్‌ (Hyderabad)కు తీసుకొచ్చారు. తిరిగి అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు స్కూల్‌కు చేరుకున్నారు.

ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు స్కూలుకు రాకపోవడంతో హెడ్మాస్టార్ రఘుపతి అనే వ్యక్తికి బాలికను అప్పగించి.. ఇంటిదగ్గర దిపాలంటూ సూచించారు. దీంతో రఘుపతి బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. 2 రోజుల తర్వాత తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు యాలాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదే చేసిన పోలీసులు రఘుపతిని అరెస్టు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్మాస్టర్‌ వెంకటయ్యను జిల్లా కలెక్టర్ సస్పెండ్‌ చేశారు.

Updated Date - 2023-02-22T13:07:57+05:30 IST