ED Raids: తెలంగాణ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

ABN , First Publish Date - 2023-06-22T10:49:49+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మెడికల్ కళాశాలలపై ఈడీ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో కేసు నమోదు అయ్యింది. వరంగల్ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తోంది.

ED Raids: తెలంగాణ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు (ED Raids) కొనసాగుతున్నాయి. మెడికల్ కళాశాలలపై ఈడీ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో కేసు నమోదు అయ్యింది. వరంగల్ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్రంలో పది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి తర్వాత అమ్ముకున్నారని అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని తొమ్మిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. 20 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డిలలో ఈడీ సోదాలు చేపట్టింది. ఓవైసీ హాస్పటల్‌లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే పలు మెడికల్ కాలేజీలలో సోదాలు ముగియగా.. మరికొన్ని చోట్ల రెండవ రోజు ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు ఈడీ సోదాలు జరగనున్నాయి.

Updated Date - 2023-06-22T10:49:49+05:30 IST