Etala Rajender: బీసీ బంధు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే

ABN , First Publish Date - 2023-08-29T18:10:26+05:30 IST

బీసీ బంధును సీఎం కేసీఆర్(cm kcr) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే తెచ్చారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు.

Etala Rajender: బీసీ బంధు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే

బోయినపల్లి: బీసీ బంధును సీఎం కేసీఆర్(cm kcr) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే తెచ్చారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. మంగళవారం నాడుబీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఉన్నప్పటికీ.. కేసీఆర్ దాన్ని చెత్తబుట్టలో వేశారని మండిపడ్డారు. ఎంబీసీ కోసం పెట్టిన నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. రైతు బంధులు ప్రకటించి పాలభిషేకం చేయించుకోవడం కాదు. వారి బతుకుల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. ఎన్నికల కోసం అలవికానీ హామీలు ఇవ్వవద్దని హితవు పలికారు. కేసీఆర్ పోటీచేసే స్థానాల్లో బీజేపీ బలమైన అభ్యర్థులను నిలబెడుతుందని చెప్పారు.కేసీఆర్‌ను ఓడించి తీరుతామని ఈటల రాజేందర్ చెప్పారు.

Updated Date - 2023-08-29T18:10:26+05:30 IST