Home » Eetala Rajender
BC issues in Parliament: పార్లమెంట్లో ఇవాళ బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, ఈటల రాజేందర్, వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని ఎంపీలు డిమాండ్ చేశారు.
Etela Rajender: దేశాన్ని గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్ ఎనర్జీ దిశగా తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో బొగ్గు విద్యుత్ ఉన్న ప్రాంతాలు అన్ని బొందల గడ్డలుగా మారాయని విమర్శించారు. కొన్ని మందులపై ట్యాక్స్ లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.
మల్కాజిగిరి ఎంపీ, మాజీమంత్రి ఈటల రాజేందర్(Malkajgiri MP and former minister Etala Rajender)ను మీర్పేట్కు చెందిన బీజేపీ నేతలు, కార్పొరేటర్లతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్ శంకర్రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతినగర్లో కుటుంబ నియంత్రన చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏమిటని మల్కాజిగిరి ఎంపీ ఈట ల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు.
ఆకలి ఉన్నవారికే అధికారం రావాలని, ప్రజల ఆకలి సమస్యలు అర్థం చేసుకోవడమే నిజమైన అంబేడ్కర్ స్ఫూర్తి అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) అన్నారు. చైతన్యం, త్యాగాలు, ప్రజాస్వామ్యం లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదన్నారు. అధికారం కొనుక్కుంటే వచ్చేది కాదన్నారు.
భారతదేశమే కాకుండా ప్రపంచం మెచ్చిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మాగాంధీ అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు. రక్తపు బొట్టు చిందించకుండా దేశానికి స్వాతంత్రం సాధించడం ద్వారా ప్రపంచానికి అహింస పద్ధతితో పోరాటం అనే ఆయుధాన్ని గాంధీ అందించారని ఆయన అన్నారు.
దేశంలో వ్యవసాయం, దుస్తులు ఆఖరికి ఇల్లు కావాలన్నా.. జీవించడానికి కావాల్సిన ప్రతి ప్రధాన పని విశ్వకర్మలతోనే ముడిపడి ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు.
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎగిరేది కాషాయ జెండానే అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలోని పద్మావతి ఫంక్షన్హాల్లో శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సభ్యత్వ నమోదు వర్క్షాపు నిర్వహించారు.
లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని తెలిపారు.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని.. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని డీకే అరుణ విమర్శించారు.
కేంద్రీయ విద్యాలయాలు శక్తివంతమైన మినీ ఇండియా లాంటివని, ప్రతీ పాఠశాల భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు. తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రీయ ఏక్తా పర్వ్ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.