Share News

Rangareddy Dist.: రాజేంద్రనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Dec 27 , 2023 | 07:54 AM

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్‌, సులేమాన్ నగర్ ఎంఎం పహాడీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కట్టెల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

Rangareddy Dist.: రాజేంద్రనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్‌, సులేమాన్ నగర్ ఎంఎం పహాడీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కట్టెల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

కట్టెల గోదాము కావడంతో మంటలు వేగంగా అంటుకొని అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలకు తోడు భారీగా పొగ వ్యాపించడంతో స్థానికులు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అత్తాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Updated Date - Dec 27 , 2023 | 07:54 AM