Gutta Sukhender Reddy : జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం జిమ్మిక్కులు చేస్తోంది

ABN , First Publish Date - 2023-09-13T11:49:10+05:30 IST

జనవరి 16 లోపు తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయని.. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం జిమ్మిక్కులు చేస్తోందని.. శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Gutta Sukhender Reddy : జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం జిమ్మిక్కులు చేస్తోంది

నల్గొండ : జనవరి 16 లోపు తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయని.. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం జిమ్మిక్కులు చేస్తోందని.. శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండలోని తన నివాసంలో గుత్తా మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గర పడ్డాయంటూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మూడోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు. వైఎస్ షర్మిల లాంటి సమైక్యవాదులు రాష్ట్రంలో చొరబడ్డారని విమర్శించారు. తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తలా ఒకదారి ఎంచుకున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-13T11:49:10+05:30 IST