Telangana BJP: కర్ణాటక ఎన్నికల ప్రచారం.. స్టార్ క్యాంపైనర్స్ జాబితాలో తెలంగాణ బీజేపీ నేత

ABN , First Publish Date - 2023-04-19T12:32:25+05:30 IST

తెలంగాణ బీజేపీ కర్ణాటక ఎన్నికల హడావుడి నెలకొంది.

Telangana BJP: కర్ణాటక ఎన్నికల ప్రచారం.. స్టార్ క్యాంపైనర్స్ జాబితాలో తెలంగాణ బీజేపీ నేత

హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో (Telangana BJP) కర్ణాటక ఎన్నికల (Karnataka Elections) హడావుడి నెలకొంది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు (Telangana BJP Leaders) క్యూ కట్టనున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం మొత్తం 40 మందితో స్టార్ క్యాంపైనర్లను (Star campaigners) బీజేపీ ప్రకటించింది. జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ మంత్రి డీకే అరుణకు (DK Aruna) అవకాశం లభించింది. ప్రధాని మోదీ (PM Narendra Modi) సహా.. స్టార్ క్యాంపైనర్స్ జాబితాలో జేపీ నడ్డా (JP Nadda), రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh), అమిత్ షా (Amith shah), యోగీ (Yogi), నిర్మలా (Nirmala Sitaraman), స్మృతీ ఇరానీ (Smriti Irani, డీకే అరుణ తదితరులు ఉన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు లక్ష్మణ్ (Laxman), ఈటల రాజేందర్(Etela Rajender), ఎంపీ అర్వింద్ (MP Arvind), రఘునందనరావు (Raghunandan Rao), వివేక్ (Vivek), జితేందర్ రెడ్డి (Jitender Reddy), గరికపాటి (Garikapati), ఇంద్రసేనారెడ్డి (Indrasena Reddy), ఎస్.కుమార్ (S.Kumar), బండా కార్తీకరెడ్డిలకు (Banda Karthika Reddy) బాధ్యతలు అప్పగించారు. తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Telangana BJP Chief Bandi Sanjay), కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రచారం నిర్వహించనున్నారు.

కర్ణాటకలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ ఈజీగా గెలుస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పాత హైదరాబాద్ సంస్థానం.. ప్రస్తుత కర్ణాటకలో బీజేపీ నేతలు ఫోకస్ పెంచారు. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. బీదర్‌లో జరిగిన అమిత్ షా సభలో బండి సంజయ్, ఈటల, వివేక్ పాల్గొన్న విషయం తెలిసిందే. దక్షిణాదిలో కర్ణాటకతో పాటు తెలంగాణపై బీజేపీ అగ్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.

Updated Date - 2023-04-19T13:13:43+05:30 IST