Kishan Reddy : కేబినెట్ భేటీకి కిషన్ రెడ్డి డుమ్మా.. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా?

ABN , First Publish Date - 2023-07-05T11:26:40+05:30 IST

కేబినెట్ బేటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారని.. అందుకే కేబినెట్ భేటీకి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. అయితే అనారోగ్య కారణాల వల్లనే కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారని అధికారులు అంటున్నారు. కిషన్ రెడ్డిని మంత్రి వర్గంలో కొనసాగించడంపై సస్పెన్స్ నెలకొంది.

Kishan Reddy : కేబినెట్ భేటీకి కిషన్ రెడ్డి డుమ్మా.. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా?

ఢిల్లీ : కేబినెట్ బేటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారని.. అందుకే కేబినెట్ భేటీకి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. అయితే అనారోగ్య కారణాల వల్లనే కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారని అధికారులు అంటున్నారు. కిషన్ రెడ్డిని మంత్రి వర్గంలో కొనసాగించడంపై సస్పెన్స్ నెలకొంది. సాయంత్రానికి మరికొంత మంది మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నిన్న కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ చీఫ్‌గా పార్టీ అధిష్టానం నియమించింది. బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన అనంతరం ఆయన మీడియా ముందుకు ఇప్పటి వరకూ గమనార్హం. మీడియాతో మాట్లాడటానికి కూడా ఆయన నిరాకరిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలోని ఉండి కూడా ఆయన కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. సాయంత్రం కిషన్ రెడ్డి బాటలోనే మరికొందరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయనున్నట్టు సమాచారం.

Updated Date - 2023-07-05T11:33:34+05:30 IST