Hyderabad: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీస్ ఉన్నతాధికారి

ABN , First Publish Date - 2023-08-30T15:13:37+05:30 IST

ఓ పోలీస్ ఉన్నతాధికారి మానవత్వం చాటుకున్నారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలను నార్త్ జోన్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ మధుసూదన్ రెడ్డి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు.

Hyderabad: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీస్ ఉన్నతాధికారి

హైదరాబాద్: ఓ పోలీస్ ఉన్నతాధికారి మానవత్వం చాటుకున్నారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలను నార్త్ జోన్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ మధుసూదన్ రెడ్డి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. బేగంపేటలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో కిందపడిపోయాడు. అదే సమయంలో నార్త్ జోన్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ మధుసూదన్ రెడ్డి అటుగా వెళ్తున్నారు. హుటాహుటిన ఆ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించారు. ఆనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. హోదాను పక్కన పెట్టి సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టిన పోలీస్ అధికారిని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

cpr.jpg

Updated Date - 2023-08-30T15:13:37+05:30 IST