Abhaya Hastam: తెలంగాణలో ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రం రిలీజ్
ABN , Publish Date - Dec 27 , 2023 | 01:25 PM
Telangana: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం సచివాలయంలో అభయ హస్తం కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని రిలీజ్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం సచివాలయంలో అభయ హస్తం కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రజాపాలన లోగోను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీల ప్రొఫార్మాను రూపొందించారు. రేపటి (గురువారం) నుంచి ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ మొదలుకానుంది.