Hyderabad: విషాదం.. నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి

ABN , First Publish Date - 2023-05-02T13:15:05+05:30 IST

నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లో విషాదం చోటుచేసుకుంది. నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు.

Hyderabad: విషాదం.. నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45లో విషాదం చోటుచేసుకుంది. నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడు మృతితో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రదేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

కాగా అప్పట్లో హైదరాబాద్‌లోని కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి నాలాలో పడి మృతిచెందింది. మరలా ఈ ఘటన చోటుచేసుకోవడంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలను బయటకు పంపించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు. ఎక్కడా అడుగువేస్తే గుంతలో పడతామో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాలు కురుసినప్పుడల్లా ఇలాంటి ఘటనలు జరుగుతునే వున్నాయి. ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు.

Updated Date - 2023-05-02T13:24:53+05:30 IST