Hyderabad: ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజలో పాల్గొననున్న గవర్నర్ దంపతులు

ABN , First Publish Date - 2023-09-18T07:48:40+05:30 IST

ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి పూజలో గవర్నర్ తమిళసై దంపతులు, మంత్రి తలసాని పాల్గొననున్నారు. ఈ ఏడాది 63 అడుగుల మట్టి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు.

Hyderabad: ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజలో పాల్గొననున్న గవర్నర్ దంపతులు

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి పూజలో గవర్నర్ తమిళసై దంపతులు, మంత్రి తలసాని పాల్గొననున్నారు. ఈ ఏడాది 63 అడుగుల మట్టి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు. శ్రీ దశవిద్య మహాగణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి.. ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బారీకేడ్లు, క్యూలైన్లను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

deee.jpg

Updated Date - 2023-09-18T07:49:52+05:30 IST