Yadadri: యాదాద్రి హుండీ ఆదాయం రూ.1.86 కోట్లు

ABN , First Publish Date - 2023-04-20T20:46:25+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) ఆలయ ఖజానాకు 20రోజుల్లో రూ.1.86కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.

Yadadri: యాదాద్రి హుండీ ఆదాయం రూ.1.86 కోట్లు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) ఆలయ ఖజానాకు 20రోజుల్లో రూ.1.86కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. నృసింహుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను గురువారం కొండకింద సత్యనారాయణస్వామి మండపంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. గత నెల 31వ తేదీ నుంచి ఈ నెల 19వ తేదీ వరకు భక్తులు (Devotees) సమర్పించిన రూ.1,86,38,644 నగదు, 241 గ్రాముల మిశ్రమ బంగారం, 4.650కిలోల మిశ్రమ వెండిని ఆలయ ఖజానాలో జమచేశారు. విదేశీ కరెన్సీ 595 అమెరికన్‌ డాలర్లు, 665 యూఏఈ దిర్హామ్స్‌, 305 ఆస్ట్రేలియా డాలర్స్‌, 20 కెనడా డాలర్స్‌, 22 కథార్‌ రియాల్స్‌, 20 న్యూజిలాండ్‌ డాలర్లు (New Zealand Dollars), 30 సింగపూర్‌ డాలర్సు, 1/4 కువైట్‌ దినార్‌, 5 ఈజిప్టు పౌండ్స్‌, ఒక మలేషియా రింగెట్‌, 55 ఇంగ్లాండ్‌ పౌండ్స్‌ లభించగా, ఆలయ ఖజానాలో జమ చేసినట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు.

Updated Date - 2023-04-20T20:46:25+05:30 IST