Yadadri: 21రోజుల్లో యాదాద్రి హుండీ ఆదాయం ఎంతంటే..

ABN , First Publish Date - 2023-05-11T20:48:46+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) ఆలయ ఖజానాకు 21రోజుల్లో రూ.2.05కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.

Yadadri: 21రోజుల్లో యాదాద్రి హుండీ ఆదాయం ఎంతంటే..

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) ఆలయ ఖజానాకు 21రోజుల్లో రూ.2.05కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్న భక్తులు మొక్కు కానుకల రూపంలో హుండీల్లో సమర్పించిన కానుకలను గురువారం కొండకింద సత్యనారాయణస్వామి మండపంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి పర్యవేక్షణలో లెక్కించారు. గత నెల 20 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నృసింహుడిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా, రూ.2,05,55,422 నగదు, 45గ్రాముల మిశ్రమ బంగారం, 3.100కిలోల మిశ్రమ వెండి సమకూరింది. విదేశీ కరెన్సీ 628 అమెరికా డాలర్లు, 20 యూఏఈ దిర్హామ్స్‌, 100 ఆస్ట్రేలియా డాలర్స్‌, 20 కెనడా డాలర్స్‌, 40 న్యూజిలాండ్‌ డాలర్లు (New Zealand Dollars), ఐదు సింగపూర్‌ డాలర్స్‌, 1/6 కువైట్‌ దిన్హార్‌లు, 20 జోట్వానా పౌలా, 14 మలేషియా రింగెట్స్‌, 16 సౌదీఅరేబియన్‌ రియాల్స్‌, 5 మాల్‌దీవ్స్‌ రూఫియాలు, 1000 మయాన్‌ మరికైన్స్‌, 400 ఓమన్‌ రియాల్స్‌, 200 మౌరిటీస్‌ రూపీస్‌, 20 సౌతాఫ్రికా రన్డ్స్‌, 10 బూటాన్‌ గుల్ట్రమ్స్‌ను ఆలయ ఖజానాలో జమచేసినట్లు ఈవో తెలిపారు.

Updated Date - 2023-05-11T20:48:46+05:30 IST