Yadadri: యాదాద్రిని దర్శించుకున్న కేటీఆర్‌ తనయుడు హిమాన్షు

ABN , First Publish Date - 2023-05-17T21:25:31+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని సీఎం మనుమడు, కేటీఆర్‌ తనయుడు హిమాన్షు (Himanshu) తన స్నేహితులతో కలిసి దర్శించుకున్నారు.

Yadadri: యాదాద్రిని దర్శించుకున్న కేటీఆర్‌ తనయుడు హిమాన్షు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని సీఎం మనుమడు, కేటీఆర్‌ తనయుడు హిమాన్షు (Himanshu) తన స్నేహితులతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం యాదగిరిక్షేత్ర సందర్శనకు వచ్చిన హిమాన్షుకు కొండ కింద వైకుంఠద్వారం వద్ద బీఆర్‌ఎస్‌ (BRS) కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడినుంచి ఆయన కొండపైన పడమటి దిశలోని లిఫ్టు గుండా తిరువీధుల్లోకి వచ్చారు. పడమటి సప్తతల మహారాజగోపురం గుండా ప్రదానాలయంలోనికి వెళ్లారు. హిమాన్షుకు దేవస్థాన అధికారులు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించగా, గర్భాలయంలోని స్వయంభువులను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాకార మండపంలో అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేశారు. దేవస్థాన అధికారులు ఆయనకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తులతో సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. తూర్పు పంచతల రాజగోపురం నుంచి బయటకు వచ్చిన ఆయన భక్తులతో మాట్లాడుతూ లిఫ్టు వద్దకు చేరుకుని తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు.

Updated Date - 2023-05-17T21:25:31+05:30 IST