సుప్రీంకోర్టులో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట

ABN , First Publish Date - 2023-09-11T12:36:35+05:30 IST

సుప్రీంకోర్టులోబండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట లభించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని ప్రకటించడంపై సుప్రీంకోర్టును బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చింది.

సుప్రీంకోర్టులో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట

ఢిల్లీ : సుప్రీంకోర్టులోబండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట లభించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని ప్రకటించడంపై సుప్రీంకోర్టును బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చింది. ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశాలిచ్చింది. ఇప్పటికే డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టులో డీకే అరుణ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.

Updated Date - 2023-09-11T12:36:35+05:30 IST