BRS: పటాన్ చెరులో ముదిరిన టికెట్ లొల్లి

ABN , First Publish Date - 2023-08-24T19:16:58+05:30 IST

పటాన్ చెరు బీఆర్ఎస్‌(Patan Cheru BRS)లో టికెట్ లొల్లి ముదిరింది. బీఆర్ఎస్ టికెట్(BRS Ticket) ఆశించి నీలం మధు ముదిరాజ్(Neelam Madhu Mudiraj) భంగపడ్డారు.

BRS: పటాన్ చెరులో ముదిరిన టికెట్ లొల్లి

పటాన్ చెరు: పటాన్ చెరు బీఆర్ఎస్‌(Patan Cheru BRS)లో టికెట్ లొల్లి ముదిరింది. బీఆర్ఎస్ టికెట్(BRS Ticket) ఆశించి నీలం మధు ముదిరాజ్(Neelam Madhu Mudiraj) భంగపడ్డారు. కార్యకర్తలతో నీలం మధు ముదిరాజ్ గురువారం నాడు పటాన్ చెరులో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మధు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరించారు. రాబోయే ఎన్నికల్లో బరిలో దిగాలని అనుచరులు మధుపై ఒత్తిడి తెచ్చారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డానని.. పటాన్ చెరు టికెట్‌పై అధిష్ఠానం పునరాలోచించాలని మధు డిమాండ్ చేశారు.కార్యకర్తల నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తానని నీలం మధు తెలిపారు. సీఎం కేసీఆర్ తనకే బీఫామ్ ఇవ్వాలని అన్నారు.లేదంటే రెబల్‌గానైనా బరిలో దిగేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే నీలం మధుకు టికెట్ ఇవ్వాలని ముదిరాజ్ సంఘాల నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-08-24T19:16:58+05:30 IST