Ganesh Gupta : వైశ్యుల గౌరవాన్ని సీఎం కేసీఆర్ కాపాడారు

ABN , First Publish Date - 2023-10-02T15:34:54+05:30 IST

వైశ్యుల గౌరవాన్ని కాపాడిందని సీఎం కేసీఆర్ కాపాడారని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా(Ganesh Gupta) వ్యాఖ్యానించారు.

Ganesh Gupta : వైశ్యుల గౌరవాన్ని సీఎం కేసీఆర్ కాపాడారు

సిద్దిపేట: వైశ్యుల గౌరవాన్ని కాపాడిందని సీఎం కేసీఆర్ కాపాడారని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా(Ganesh Gupta) వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం నాడు వీఎస్ఎస్ కన్వెన్షన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా గణేష్ గుప్తా మాట్లాడుతూ..‘‘మంత్రి హరీష్‌రావుకి ప్రజలకు సేవ చేసి వారి ముఖాల్లో ఆనందం చూసినపుడు సంతోషం ఉంటుంది. కమిట్మెంట్ ఉన్న నాయకుడు హరీష్‌రావు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో హరీష్‌రావు నీ గెలిపించాలి’’ అని గణేష్ గుప్తా పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి హరీష్‌రావు లక్ష యాబై వేల మెజార్టీతో గెలవాలని వైశ్యులు ఈసభలో తీర్మానించారు.

Updated Date - 2023-10-02T15:34:54+05:30 IST