Share News

Yadadri: యాదగిరికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Dec 31 , 2023 | 11:10 AM

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Yadadri: యాదగిరికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

కాగా తెలంగాణలో సుప్రసిద్ధమైన ‘యాదగిరి’ని ఒక ఆంధ్రా అయ్యోరు చెప్పినదానికి విలువనిచ్చి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘యాదాద్రి’గా మార్చడం అప్రజాస్వామికమని ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి అన్నారు. తెలంగాణలో ఎందరో ఆ దేవుని పేరు పెట్టుకున్న ‘యాదగిరి’లున్నారని, ఆ దేవుని మీద గురి ఉన్నదని, పాత కృష్ణా జిల్లాలో ‘వేదాద్రి’ ఉన్నది... దాని వికృతియే ‘యాదాద్రి’. ఈ వికృతి మనకెందుకు?.. తెలంగాణ ప్రాంతీయతను ప్రతిబింబించే పురాతన, సనాతన ‘యాదగిరి’ పేరునే పునరుద్ధరించవలసిందిగా కొత్త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతున్నానన్నారు. అలాగే భద్రాచలాన్ని భద్రాద్రిగా మార్చారని, కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు ‘భద్రాచలం రోడ్‌’ అనే ఉందని, ప్రజాప్రభుత్వంలో ప్రజల వ్యవహారంలో ఉన్న పేర్లే ఉండాలి కనుక ‘యాదగిరి– భువనగిరి’ జిల్లా అని, ‘భద్రాచలం– కొత్తగూడెం’ జిల్లా అని మార్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని చెన్నకేశవరెడ్డి అన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 11:15 AM