Home » Bhuvanagiri
సృష్టిలోని సకల ప్రాణులపై తన దయాగుణాన్ని ప్రసరింపజేసి అపూర్వమైన తన లీలామహత్యాలతో పరిపూర్ణ అవతారంలో శ్రీ లక్ష్మీనృసింహుడు భక్తజనుల పూజలు అందుకుంటున్నాడు. గురువారం స్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మో్త్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెందో రోజు ఆదివారం ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. యాదాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.
పది రోజుల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది.
యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11: 36 గంటలకు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వివాదంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో రోజు ఆదివారం కూడా ఉద్రిక్తత కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డిపై జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, ప్రతిగా శనివారం బీఆర్ఎస్ కార్యాలయంపై యువజన కాంగ్రెస్, ఎన్ఎ్సయూఐ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే.
యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మూడో రోజు ఆదివారం అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీరామవతార అలంకారంలో నరసింహుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం యాదగిరీషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్, ఎన్ఎ్సయూఐ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
పై చిత్రాన్ని చూసి ఇదేదో సాయం సంధ్య వేళ తీసినది అనుకున్నా... ఆ మంచును గమనించి ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో తీసిన ఫొటో అని అనుకున్నా.. మీరు మంచు ముక్క కొరికినట్టే.. ఎందుకుంటే మన తెలంగాణలో తీసిన ఫొటో ఇది.
రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ అవార్డు విచారణ సమావేశాన్ని భూ నిర్వాసిత రైతులు మూకుమ్మడిగా బహిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో భువనగిరి మండలంలోని తుక్కాపురం, ఎర్రంబెల్లి గ్రామాల రైతులకు సంబంధించి అవార్డు విచారణ సమావేశం శనివారం ఏర్పాటు చేశారు.