Gutha: తెలంగాణ ప్రజలపై ప్రధాని మోడీ మరోసారి విషం కక్కారు

ABN , First Publish Date - 2023-09-19T11:57:43+05:30 IST

పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రజలపై ప్రధాని మోడీ మరోసారి విషం కక్కారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Gutha: తెలంగాణ ప్రజలపై ప్రధాని మోడీ మరోసారి విషం కక్కారు

నల్గొండ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రజలపై ప్రధాని మోడీ (PM Modi) మరోసారి విషం కక్కారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender Reddy) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్స్ తీసుకొచ్చిందన్నారు. ఆచరణకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దని హితవుపలికారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ స్కీమ్స్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి తెలంగాణ కోసం ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు కప్పిపుచ్చుకునేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-19T11:57:43+05:30 IST